RDO Nagaraju: మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దు…

by Kalyani |
RDO Nagaraju: మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దు…
X

దిశ, పెంట్లవెల్లి : మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని కొల్లాపూర్ ఆర్డీవో నాగరాజు ఆదేశాలు జారీచేశారు. శనివారం పెంట్లవెల్లి మండల కేంద్రంలోని మంచాలకట్ట గ్రామంలో ఆర్డీవో అధికారులతో కలిసి కృష్ణానదికి వస్తున్న భారీ వరదను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పెంట్లవెల్లి ఎమ్మార్వో చిట్యాల ప్రభాకర్, ఆర్ ఐ శివన్న గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed