జోగులాంబ సన్నిధిలో మంత్రి శ్రీధర్ బాబు

by karthikeya |
జోగులాంబ సన్నిధిలో మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, అలంపూర్ టౌన్: దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించుకున్నారు. అలంపూర్ వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబుకు ఆలయ మర్యాదలతో ఈవో పురేందర్ పాలకమండలి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు కుటుంబం ముందుగా గణపతి పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయం చేరుకొని కుంకుమార్చనతో పాటు యాగశాలలో ప్రత్యేక యాగం నిర్వహించారు. మంత్రితోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు.





Advertisement

Next Story