చివరి రోజు నామినేషన్ దాఖలు చేసిన మన్నె శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 11 |
చివరి రోజు నామినేషన్ దాఖలు చేసిన మన్నె శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ల చివరి రోజైన గురువారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి నాయక్ కు దాఖలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి కూడా మాజీ సీఎం కేసీఆర్ ఆయనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో రంగంలో ఉన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి,ఆల వెంకటేశ్వర రెడ్డి లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed