వాక్ థన్ ను విజయవంతం చేయండి..

by Sumithra |
వాక్ థన్ ను విజయవంతం చేయండి..
X

దిశ, జడ్చర్ల : ఈనెల 7న జడ్చర్ల పట్టణంలోని ఏగూర్ ప్రైమ్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ప్రజా ఆరోగ్యం దృశ్య వాక్ థన్ నడక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏగుర్ ప్రైమ్ ఆస్పత్రి ఎండీ అంకిత్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో పడి ప్రజలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.

తమ వద్ద వచ్చే కేసుల్లో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వల్ల వచ్చే కేసులే అధికంగా ఉన్నాయని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజా మేలుకొలుపు కొరకు వారి ఆరోగ్యం దృశ్య తమ వంతు బాధ్యతగా వాక్ థన్ నడక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం 07- 07 2024 నాడు ఎగుర్ ప్రైమ్ ఆస్పత్రి నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించనున్నామని తెలిపారు.

Advertisement

Next Story