ప్రాథమిక పాఠశాలలో కింగ్ కోబ్రా.. భయాందోళనలో విద్యార్థులు..

by Sumithra |
ప్రాథమిక పాఠశాలలో కింగ్ కోబ్రా.. భయాందోళనలో విద్యార్థులు..
X

దిశ, మహమ్మదాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలో మంగళవారం కంచుంపల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలోని వంట గదిలో విషసర్పాన్ని ( కింగ్ కోబ్రా) చూసి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు అనుకోకుండా ఎదురైన ఈ ఘటనతో విస్తుపోయారు. వెంటనే ఉపాధ్యాయులకు, స్థానికులకు సమాచారం అందించారు. పాఠశాల వంట గదిలో నక్కి ఉన్న పామును అత్యంత విషపూరితమైన సర్పంగా గుర్తించి చంపటానికి వెనకాడారు. స్థానికులు, ఉపాధ్యాయులు పాములు పట్టే వాళ్లకు సమాచారం అందించడంతో వారు పాముని పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలారు.

Advertisement

Next Story

Most Viewed