కిరాణా దుకాణంలో దొంగల కలకలం..!!

by Anjali |
కిరాణా దుకాణంలో దొంగల కలకలం..!!
X

దిశ, గద్వాల టౌన్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో ఓ కిరాణా దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. షాపు వెనుక భాగంలో రేకుతో ఉన్న పై కప్పును తొలగించి చోరీకి పాల్పడ్డారని దుకాణం యజమాని తెలిపారు. దుకాణంలో ఉన్న రూ. 24 వేల నగదు సహా, పలు వస్తువులు చోరీకి గురయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని దుకాణం యజమాని తెలిపారు. వరుస దొంగతనాలు జరుగుతున్న పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed