కేటిదొడ్డిలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం..

by Sumithra |
కేటిదొడ్డిలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం..
X

దిశ, కేటిదొడ్డి : వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వ చర్యకు నిరసనగా ఆదివారం కేటిదొడ్డి మండల కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం చెబుతుందని ఎన్నికలకు ముందే కేసీఆర్‌ చెప్పిన మాటలను రేవంత్‌రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందని తెలిపారు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టి రైతుల నోట్లో రేవంత్‌ రెడ్డి మట్టి కొట్టాడని మండిపడ్డారు. వానాకాలం రైతు భరోసా ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందేనని.. లేదంటే కాంగ్రెస్‌ నాయకులను ఎక్కడికక్కడ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్క‌రవి, కృష్ఞ, రవి, గోవిందు, అంజి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story