- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి : పరిగి ఎమ్మెల్యే
దిశ, మహమ్మదాబాద్/ గండీడ్: మండలంలో చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పగిడ్యాల్ క్లస్టర్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త సైనికుల పని చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. వివిధ గ్రామాల ప్రజలతో హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీని తీసుకురావాలని కోరారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాలలో అబద్ధాలతో మోసపూరిత మాటలతో మోసం చేసిన బీఆర్ఎస్ , బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలో ఐదు గ్యారంటీలు అమలు చేసిందనీ పాంచ్ న్యాయ్ ద్వారా రైతులకు, మహిళలకు, యువకులకు, శ్రామికులకు సమగ్ర న్యాయం అందుతుందని రాహుల్ గాంధీ ప్రధానిగా డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. .
ఈ కార్యక్రమంలో మాజీ డి సి సి బి చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి పీఎసీఎస్ మాజీ చైర్మన్ కమతం విష్ణు వర్ధన్ రెడ్డి, మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం, నారాయణ వివిధ గ్రామాల సర్పంచులు జి. పుల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాధ రెడ్డి, మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సునీత మాజీ సర్పంచ్ అనంత లక్ష్మారెడ్డి ,మండల నాయకులు మన్యపు రెడ్డి మండల, జిల్లా ,నాయకులు కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.