అధికారుల నిర్లక్ష్యం.. ఒకే స్తంభానికి రెండు విధి దీపాలు..

by Sumithra |
అధికారుల నిర్లక్ష్యం.. ఒకే స్తంభానికి రెండు విధి దీపాలు..
X

దిశ, గుండుమాల్ : నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో బీసీ కాలనీలో కొన్ని స్తంభాలకు రెండు రెండు విధి దీపాలు ఏర్పాటు చేశారు. శ్రీ రామ కాలనీలో కొన్ని స్తంభాలకు బల్బులే పెట్టలేదు. లైట్లు లేని చోట కారు చీకటి ఉండి మురికి కాలువలో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు జారీ పడుతున్నారు. ఉన్న దగ్గరే రెండు బల్బులు పెట్టడం ఏంటని గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అన్ని స్తంభాలకు బల్బులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed