Crowd of devotees : మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

by Naveena |
Crowd of devotees : మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
X

దిశ,కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి:మండల పరిధిలోని నాయినేనిపల్లి గ్రామ శివారులో భక్తుల కోరికలు తీర్చే మైసమ్మ దేవత దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలు మూలల నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు మైసమ్మ దేవతను దర్శించుకుని తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో తీర్చుకున్నారు. భక్తుల నుంచి ఆదివారం హుండీ లో రూ, 77,030లు,టికెట్ల ద్వారా రూ,40,825లు మొత్తం రూ,1,17,55వేలు మైసమ్మ దేవత ఆలయానికి ఆదాయం వచ్చినట్లు ఆలయ ట్రస్టీచైర్మన్ శ్రీనివాస్ యాదవ్,ఈవో రామేశ్వర్ శర్మ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed