అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ని గెలిపించండి : దేవరకద్ర ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ని గెలిపించండి : దేవరకద్ర ఎమ్మెల్యే
X

దిశ,దేవరకద్ర: రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం దేవరకద్ర మండల పరిధిలోని గోపులాపూర్, గూరకొండ, మీనుగోని పల్లి,గుడిబండ గ్రామాలలో పర్యటించారు ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ మాట్లాడుతూ ఆరు నుంచి ఎనిమిది నెలల్లో మీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే బాధ్యత మాదే అన్నారు. ఆరు గ్యారెంటీ లో రెండు గ్యారెంటీలను పూర్తి చేశామని అన్నారు. కరెంట్ బిల్లులు ఎవరు కట్టవద్దని, కట్టమని ఎవరైనా అడిగితే మా ఎమ్మెల్యే కట్టొదని చెప్పాడని చెప్పండి. గత ప్రభుత్వము అసమర్థత వల్ల లాభాల్లో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణ గా చేసి కాలి బిందె చేతికి ఇచ్చి వెళ్లారని అన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ,బీఆర్ఎస్ పార్టీలు పాలమూరు ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి ప్రయత్నాన్ని మనం తిప్పి కొట్టి వాళ్లకు బుద్ధి చెప్పాలని అన్నారు.

ముఖ్యమంత్రి మన ప్రాంతం వాడు కాబట్టి మన జిల్లా అభివృద్ధికి సహకరిస్తాడని అన్నారు.బిజెపి అభ్యర్థి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తెస్తానని అంటున్నది. ఏమైంది మరి గెలిచిన 10 ఏళ్ల కాలంలో ఏమి అభివృద్ధి చేసిందని అన్నారు. కోయిల్ సాగర్ కాలువలైన పూర్తి చేశారా అన్నారు.బిజెపి వాళ్లు రాముని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని , మనకు కూడా దేవుడు రాముడే అన్నారు.బిజెపి అభ్యర్థి గెలిస్తే వాళ్ళ వ్యాపారాలు తప్ప ఏమి అభివృద్ధి జరగదని అన్నారు. కావున జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటు వేసి చల్ల వంశీచంద్ రెడ్డినీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మీకాంత్ రెడ్డి,మండల నాయకులు ,ఆది హనుమంత్ రెడ్డి, కొండ శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంజన్ రెడ్డి, ఎద్దుల అరుణ,ఎర్రోళ్ల చంద్రయ్య, హనుమంతు, వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story