సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది..

by Sumithra |
సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది..
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లా నెల్లికొండ చౌరస్తా బస్సు షెల్టర్ వద్ద ఆర్టీసీ బస్ షెల్టర్ పేరును తొలగించి సొంతంగా ప్రకటనలు రాయించుకున్నాయి కొన్ని కంపెనీలు. దీంతో ఆర్టీసీకి నష్టంతో పాటు ప్రజలు బస్ షెల్టర్ ను గుర్తించలేకపోతున్నారు. ఆర్టీసీ బస్ షెల్టర్ పేరును తొలగించి సొంత అవసరాలకు వాడుకున్న ప్రైవేట్ కంపెనీల పై ప్రజలు సొమ్ము ఒకరిది..సోకు మరొకరిది అంటూ మండిపడుతున్నారు. సుమారు నెల రోజులు కావస్తున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పలువురు మేధావులు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ ప్రకటనలను తొలగించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story