మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మీడియాను అవమానించిన కమిషనర్

by Kalyani |
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మీడియాను అవమానించిన కమిషనర్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శనివారం మీడియాను కమిషనర్ శ్యాంసుందర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాను పలకరించకపోవడంతో సుమారు గంటపాటు కమిషనర్ కార్యాలయం ముందు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు నిరీక్షణ చేసి చివరికి కమిషనర్ తీరును వ్యతిరేకిస్తూ మీడియా ప్రతినిధులందరూ సమావేశాన్ని బహిష్కరించి వాక్ అవుట్ చేశారు. అలాగే శుక్రవారం రోజు ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల నల్లమల్ల టూర్ స్టడీ సందర్భంగా అటవీశాఖ అధికారులు మీడియాకు అనుమతించకపోవడంతో నియోజకవర్గంలో వాడి వేడిగా చర్చ జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు, నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. దూరం పెట్టడంలో ఆంతర్యమేమిటోననీ నియోజకవర్గ ప్రజలు చర్చించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed