తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

by Disha Web Desk 23 |
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
X

దిశ, కేటిదొడ్డి: తాళం వేసి ఉన్న ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, నగదును అపహరించారు. ఈ సంఘటన బుధవారం కేటి దొడ్డి మండల పరిధి గువ్వల దీన్నే గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. గువ్వలదిన్నెకు చెందిన హనుమంతు రెడ్డి మంగళవారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు. బీరువా పగలగొట్టి అందులో 1.5 తులాల బంగారం, రూ.2.40 లక్షల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఇంటిని పరిశీలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed