బీసీల రాజ్యాధికారమే ధ్యేయం

by Sridhar Babu |
బీసీల రాజ్యాధికారమే ధ్యేయం
X

దిశ,చారకొండ : తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల రాజ్యం స్థాపించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం మండలంలోని శిరసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రాజ్యస్థాపనకు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కల్వకుర్తిలో జరిగే బీసీ మహాధర్నాకు తరలి వెళ్లారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గురవయ్య గౌడ్, బీసీ నాయకులు జూపల్లి వెంకటయ్య యాదవ్, గజ్జె యాదయ్య, ఇర్విన్ రవి, రమేష్, సలీం, చండిశ్వర్ గౌడ్, కన్నా, సత్యం, అశోక్, శ్రీను, కొండల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story