- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణ కిసాన్ మోర్చా నేతలతో ఏలేటి భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంపై బీజేపీ దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 30న ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ‘బీజేపీ రైతు హామీల సాధన దీక్ష ను చేపడుతోంది. కాగా ఈ దీక్షను విజయవంతం చేయడంపై పార్టీ దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కిసాన్ మోర్చ, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రైతు దీక్షను సక్సెస్ చేయాలని రివ్యూ నిర్వహించారు. తెలంగాణ రైతులంతా ఈ దీక్షకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేసిన మోసం, దగాను తెలంగాణ రైతులకు వివరించాలని, ఇప్పటికే రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లుగా వారు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు హామీల అమలు కోసం చేపడుతున్న ఈ రైతు దీక్ష ఈనెల 30న ఉదయం 11 గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు కొనసాగనుంది.