27 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా

by Mahesh |
27 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా
X

దిశ, అడ్డాకుల: 27 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాదుకు వెళ్తున్న PY04 A 2518 వోల్వో బస్సు లారీని తప్పించబోయి అడ్డాకుల సమీపంలో తెల్లవారుజామున 5 గంటలకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అడ్డాకుల గ్రామానికి చెందిన కృష్ణయ్య (52) బహిర్భూమికి వచ్చిన వ్యక్తిపై బస్సు పడిపోయింది. దీంతో గ్రామానికి చెందిన వ్యక్తి శరీర భాగం పూర్తిగా ఛిద్రమైపోయింది. అలాగే గాయపడిన డ్రైవర్ వెంకటేష్, కుమార్, శ్యామ్ కుమార్, కిరణ్‌లను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సును పక్కకు తీశారు. అలాగే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed