కేఎల్ఐ కాలువలో పల్టీ కొట్టిన పత్తి కూలీల వాహనం

by Mahesh |   ( Updated:2024-10-13 05:41:02.0  )
కేఎల్ఐ కాలువలో పల్టీ కొట్టిన పత్తి కూలీల వాహనం
X

దిశ, నాగర్ కర్నూల్: పత్తి తీయడానికి కూలీలతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి కేఎల్ ఐ కాల్వలోకి పల్టీ కొట్టింది. ఈ విషాద సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ చౌరస్తా సరస్వతి టెంపుల్ ముందు ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంతటి గ్రామానికి చెందిన 13 మంది సరస్వతి టెంపుల్ పక్కన పత్తి తీయడానికి వెళ్తుండగా కాలువ కే ఎల్ ఐ మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి కాల్వలోకి పల్టీ కొట్టింది. టాటా ఏసీ వాహనంలో ప్రయాణిస్తున్న మహమ్మద్ బేగం అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story