పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్లిద్దరూ కనిపించరు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్లిద్దరూ కనిపించరు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి కనిపించరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉంటే కవితను జైళ్లో ఎందుకు వేస్తారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీపై పోరాడలేక రాహుల్ గాంధీ ఆమేథీ నుండి కేరళలోని వయనాడ్‌కు పోరిపోయారన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి రేవంత్ రెడ్డి కేవలం 5 వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి అన్నీ ఇచ్చిందని.. కానీ ఆయన మాత్రం ఐదేళ్లలో మల్కాజిగిరి కోసం ఏమి చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను 10 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే దేశ రాజకీయాలను శాసిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed