కార్యకర్తల కృషి వల్లే బీజేపీ 8 సీట్లలో విజయం: కిషన్ రెడ్డి

by Satheesh |
కార్యకర్తల కృషి వల్లే బీజేపీ 8 సీట్లలో విజయం: కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ ఎన్నికల్లో కార్యకర్తలంతా ఎంతో కష్టపడి పని చేశారని, వారి శ్రమ వల్లే రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచామని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కొనియాడారు. మోడీ కేబినెట్ 3.0లో మరోసారి అవకాశం దక్కించుకున్న కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటు శాతం పెంచుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల తరుఫున మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సామాన్య కార్యకర్తను గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకురాలేదని.. నరేంద్ర మోడీ వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. కేంద్రమంత్రులుగా అంకితభావంతో పని చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story