దేశానికి వెన్నుముక రైతన్న

by Sridhar Babu |
దేశానికి వెన్నుముక రైతన్న
X

దిశ, వైరా : దేశానికి వెన్నుముక రైతన్న అని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసనాయక్ అన్నారు. వైరా సొసైటీ కార్యాలయంలో శనివారం సొసైటీ అధ్యక్షులు బొర్రా రాజశేఖర్ అధ్యక్షతన రైతు భరోసా పథకంపై ప్రత్యేక మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాపీ చేస్తుందన్నారు. ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పథకం ద్వారా పంటలు పెట్టుబడి కోసం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు.

అనంతరం రైతు భరోసా పథకంపై రైతుల వద్ద నుంచి పలు సలహాలు, సూచనలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్, వైరా సొసైటీ అధ్యక్షులు బొర్రా రాజశేఖర్, సంఘ డైరెక్టర్లు యన్నం వెంకటకోటారెడ్డి, పసుపులేటి హనుమంతరావు, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, బొల్లెపోగు శ్రీను కౌన్సిలర్ కోటయ్య, వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకటనర్సిరెడ్డి, పీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు,

మచ్చా నర్సింహారావు, మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు షేక్ రహీం, షేక్ లాల్మహ్మద్ , తుమ్మల రాణాప్రతాప్, దార్న రాజశేఖర్ , నూతి సత్యనారాయణ , పరుచూరి రామారావు, మచ్చా రామారావు, గుడిపుడి రామక్రిష్ణ, మంచాల జయరాజు, బుద్దా సురేష్, ఫణితి సైదులు, బట్టా పెద్ద భద్రయ్య, బోళ్ల గంగారావు , కొల్లి శ్రీనివాసరావు , కొల్లి నాగేశ్వరరావు , వరంగల్ డీఆర్ఏవో వాలియానాయక్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ మౌలానా, సొసైటీ కార్యదర్శి బి.రామకృష్ణ , సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed