పురుగుమందు తాగి యువకుడు మృతి

by karthikeya |
పురుగుమందు తాగి యువకుడు మృతి
X

దిశ,సత్తుపల్లి: మనస్తాపం చెంది యువకుడు పురుగుమందు తాగి మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగళ్ళపాడు గ్రామానికి చెందిన షేక్ షాషా (25) ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ స్థానికంగా ఓ కిరాణా షాపు కూడా నడుపుతూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనుకోకుండా జరిగిన సంఘటనతో తీవ్ర మనస్తాపం చెంది శనివారం అర్ధరాత్రి పురుగుమందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరికి తరలించారు. మృతుడు షేక్ షాషాకి భార్య, కుమార్తెతో పాటు గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న తల్లి, ఇటీవల ప్రమాదంలో కాలికి తీవ్ర గాయమై మంచంలో చికిత్స పొందుతున్న తండ్రి ఉన్నారు. ప్రస్తుతం పాషానే ఇంటికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. షాషా మృతిపై గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే అతడి మనస్థాపానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed