విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలి

by Sridhar Babu |
విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలి
X

దిశ, కొత్తగూడెం : విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం పాల్వంచ శ్రీనివాస కాలనీలోని మినీ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న క్రీడాపోటీలను తిలకించి ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలన్నారు. ఆ దిశగా విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

నేటితరం విద్యార్థులు సెల్ఫోన్లు, యూట్యూబ్లో నిమగ్నమై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలా కాకుండా ఆసక్తితో చదువుతూనే ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటే వారిలో మానసిక వికాసంతో పాటు దేహదారుఢ్యం కలుగుతుందన్నారు. క్రీడలతో ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా ఉండొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ పరందామరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, డాక్టర్ యుగంధర్ రెడ్డి, అన్నం వెంకటేశ్వర్లు, విజయబాబు పాల్గొన్నారు.

Next Story