- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
నకిలీ నోట్ల కలకలం.. రూ.91 వేల బురిడీ
by Aamani |
X
దిశ, జూబ్లిహిల్స్: విదేశీ కరెన్సీ నోట్లు అని చెప్పి , నకిలీ నోట్ల తో అమాయకులను మోసం చేస్తున్న వారిపై బోరబండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే... బోరబండ లో పాన్ బ్రోకర్స్ షాప్ లో , బాధితులకు దుబాయ్ దిరమ్స్ నోట్లు అని చెప్పి దాదాపు రూ.91 వేల ఇండియన్ కరెన్సీ మార్పిడి జరిగింది. కాసేపటికి అవి దుబాయ్ కరెన్సీ నోట్లు కాదని , నకిలీ కరెన్సీ నోట్లు అని తేలడంతో మోసపోయామని బాధితులు బోరబండ పోలీస్ స్టేషన్ లో ఆదివారం నిందితుల పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నామని , దీని వెనుక ఇంకా ఎవరెవరు నిందుతులున్నారో విషయం పై దర్యాప్తు చేస్తున్నాం అని , సోమవారం ఈ ఘటన పై మీడియా కి పూర్తి వివరాలు తెలియజేస్తామని బోరబండ పోలీసులు తెలిపారు.
Next Story