నకిలీ నోట్ల కలకలం.. రూ.91 వేల బురిడీ

by Aamani |
నకిలీ నోట్ల కలకలం.. రూ.91 వేల బురిడీ
X

దిశ, జూబ్లిహిల్స్: విదేశీ కరెన్సీ నోట్లు అని చెప్పి , నకిలీ నోట్ల తో అమాయకులను మోసం చేస్తున్న వారిపై బోరబండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే... బోరబండ లో పాన్ బ్రోకర్స్ షాప్ లో , బాధితులకు దుబాయ్ దిరమ్స్ నోట్లు అని చెప్పి దాదాపు రూ.91 వేల ఇండియన్ కరెన్సీ మార్పిడి జరిగింది. కాసేపటికి అవి దుబాయ్ కరెన్సీ నోట్లు కాదని , నకిలీ కరెన్సీ నోట్లు అని తేలడంతో మోసపోయామని బాధితులు బోరబండ పోలీస్ స్టేషన్ లో ఆదివారం నిందితుల పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నామని , దీని వెనుక ఇంకా ఎవరెవరు నిందుతులున్నారో విషయం పై దర్యాప్తు చేస్తున్నాం అని , సోమవారం ఈ ఘటన పై మీడియా కి పూర్తి వివరాలు తెలియజేస్తామని బోరబండ పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed