వరద బాధితులకు ఎంపీ సాయం

by Sridhar Babu |
వరద బాధితులకు ఎంపీ సాయం
X

దిశ,ఖమ్మం రూరల్ : ఇటీవల ఆకేరు వాగు ఉప్పొంగి ఖమ్మం రూరల్ మండలం కస్నాతండా ప్రజలు తీవ్రంగా నష్టపోగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శుక్రవారం నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. బియ్యం, ఉల్లిగడ్డలు, పప్పు, ఉప్పు, కారం, వంట నూనె, టీ పొడి, పేస్టు, బ్రష్, జెట్ కాయిల్స్, దుప్పట్లతో కూడిన సంచులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ అనుకోని వరద విపత్తుతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. వ్యక్తిగతంగా తాను కూడా సహాయ, సహకారాలు అందిస్తానని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు బానోతు పాపా నాయక్, యువజన నేత బానోతు ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed