- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
తాలిపేరు పరిసర ప్రాంత ప్రజలకు డేంజర్..హెచ్చరిక జారీ చేసిన అధికారులు
by Aamani |
X
దిశ, భద్రాచలం : చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గత వారం రోజులుగా తెలంగాణ, చతిస్గడ్ సరిహద్దు అటువైపు ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఆలి పేరు ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి 1,42,070 క్యూసెక్కుల నీరు తరలిరాగా, అధికారులు 24 గేట్లు ఎత్తి 1,37,518 క్యూసెక్కుల నీటిని దిగనున్న గోదావరిలోకి వదిలారు.ప్రాజెక్టుకు ఇంకా భారీగా వరద నీరు తరలివస్తుందని, సమీప గ్రామాలు పెద్ద మిడిసి లేరు, బి.కొత్తూరు , చిన్న మిడిసి లేరు, ఆంజనేయపురం, దోసిల్లపల్లి, భూమిని లంక, గుంపిన గూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. గత పది సంవత్సరాలలో కాలి పేరు ప్రాజెక్టుకు ఇంత పెద్ద ఎత్తున వరద తరలి రావడం ఇదే మొదటిసారి.
Advertisement
Next Story