- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా
దిశ, ఖమ్మం : పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన పేదలను ఆర్ధికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల చెక్కులతో పాటు వైరా నియోజకవర్గంలోని సింగరేణి , మధిర నియోజకవర్గంలోని చింతకాని, ముదిగొండ మండలాలకు సంబంధించిన మొత్తం 65 మంది చెక్కులను లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయంలో అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని తెలిపారు. అర్హులందరికీ జాప్యం లేకుండా.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, జిల్లా నాయకులు చావా శివరామ కృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లా రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్లపూడి భద్రకాళి, మద్ది కిషోర్ రెడ్డి, మందపల్లి నాగమణి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వెంపటి రవి, శేఖర్ రెడ్డి, నాగేశ్వరరావు, డీవీఆర్ బాబు, ఉమ్మినేని కృష్ణ, ఇమ్మడి తిరుపతి రావు, కోట వెంకటేశ్వర్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.