వరద నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన కేంద్ర బృందం

by Aamani |
వరద నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన కేంద్ర బృందం
X

దిశ, ఖమ్మం రూరల్: ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కెపీ. సింగ్ నేతృత్వంలో మహేష్ కుమార్, శాంతినాథ్ శివప్ప, ఎస్కె. కుష్వాహ, టి. నియాల్ కాన్సన్, డా. శ్రీ శశి వర్ధన్ రెడ్డి లతో కూడిన కేంద్ర బృందం ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించింది. మొదటి బృందం కూసుమంచి మండలం భగత్ వీడు, ఖమ్మం రూరల్ మండలం గూడూరు పాడు, తనగంపాడు, కస్నా తాండ, తిరుమలాయపాలెం మండలం రాకాశితండా గ్రామాల్లో, రెండో బృందం కూసుమంచి మండలం మల్లాయిగూడెం, భద్రు తాండ, పాలేరు, ఎర్రగడ్డ తండా గ్రామాల్లో పర్యటించి, భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది.

గ్రామాల్లో ఇసుక మేటలు, మట్టి తో నిండిన పొలాలు, కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు, దెబ్బతిన్న ఇండ్లు, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను కేంద్ర బృందం కలిసి, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో జరిగిన నష్టం, తిరిగి సేద్య యోగ్యంగా పొలాన్ని తయారుచేయుటకు అగు ఖర్చును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ (విపత్తు నిర్వహణ) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రాష్ట్ర గనులు, భూగర్భ ఖనిజాల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ లు పర్యటించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందం పర్యటన సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను చూపిస్తూ, భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విలయాన్ని బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed