సమంత, నాగార్జునపై తెలంగాణ BJP MP కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-07 11:05:44.0  )
సమంత, నాగార్జునపై తెలంగాణ BJP MP కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వ్యాఖ్యలతో అక్కినేని నాగ చైతన్య, సమంత(Naga Chaitanya, Samantha) విడాకుల వ్యవహారం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీ మొత్తం స్పందించి సమంతకు అండగా నిలిచారు. దీంతో మంత్రి కొండా సురేఖ సైతం మరోసారి స్పందించి.. సమంతకు క్షమాపణ చెప్పారు. తాను ఏ విషయంలో అయితే బాధపడుతున్నానో.. అదే అంశంలో మరో మహిళను బాధపెట్టానని భావించి.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

తాజాగా.. నాగార్జున, సమంతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నాగార్జునపై మాట్లాడారు. ‘అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ఎఫ్టీఎల్‌లో ఉందని 2016లో ఎచ్‌ఎండీఏ రిపోర్ట్ ఇచ్చిందని, అప్పటి నుంచి ఎందుకు కూల్చలేదు. ఆ సమయంలో నాగార్జున కోడలుగా ఉన్న సమంత.. చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యారు. అసలు ఆమెకు చేనేతరంగం గురించి ఏం తెలుసు. అప్పటి ప్రభుత్వానికి రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధమేంటో చెప్పాలి’ అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed