- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టుంది కేసీఆర్ పాలన!.. టీ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
![అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టుంది కేసీఆర్ పాలన!.. టీ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్ అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టుంది కేసీఆర్ పాలన!.. టీ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్](https://www.dishadaily.com/h-upload/2024/03/29/322189-brs-inc.webp)
దిశ, డైనమిక్ బ్యూరో: అత్తసొమ్ము అల్లుడు దానం అన్నట్టు పేరు రైతులది.. పైసలు రియల్ ఎస్టేట్ కి అంటూ తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధులో జరిగిన అక్రమాలను ప్రస్తావిస్తూ.. ఆసక్తికర పోస్ట్ చేసింది. రాళ్లకు, రప్పలకు రైతుబంధు అంటూ ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. పేరు రైతులది.. పైసలు రియల్ ఎస్టేట్ కి, ఇదీ ఘనత వహించిన కేసీఆర్ పాలనలో జరిగిన నేరం, ఘోరం అని మండిపడింది. పేద మధ్య తరగతి రైతులకు దక్కాల్సిన రూ. 26 వేల కోట్లు సొమ్ములను రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారని తెలిపింది. తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన పన్నులను.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రక్షాళన జరగాలి.. నిజమైన రైతులకు న్యాయం చేయాలని కోరింది. ప్రజా ప్రభుత్వం సిద్ధం చేస్తోన్న రైతు భరోసా విధివిధానాలే ఈ ప్రక్షాళనకు నాంది అని టీ కాంగ్రెస్ స్పష్టం చేసింది.