నాటి గులాబీ జెండాను భద్రంగా దాచిన పెద్ది సుదర్శన్.. పునరావిష్కరణ చేసిన కేసీఆర్‌

by Gantepaka Srikanth |
నాటి గులాబీ జెండాను భద్రంగా దాచిన పెద్ది సుదర్శన్.. పునరావిష్కరణ చేసిన కేసీఆర్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాటి ఉద్యమ పంథా పోరాట జ్ఞాపకాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి గుర్తుచేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రెండు నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపింది. దాంతో పార్టీకి తెలంగాణ సమాజం బ్రహ్మరథం పట్టింది. ఏకంగా 82 మంది జెడ్పీటీసీలు జయకేతనం ఎగురవేశారు. ఆ ఎన్నికల్లో నర్సంపేట, నల్లబెల్లి స్థానం నుంచి జెడ్పీటీసీగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి పోటీ చేశారు. ఆయన విజయం సాధించారు.

కాగా.. ఆ సందర్భంలో ప్రచార బ్యానర్‌ను క్లాత్ మీద బ్రష్‌తో రాయించారు. అయితే.. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో సోమవారం పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావుతో దానిని పునరావిష్కరణ చేయించారు. నాటి బ్యానర్‌ను భద్రపరిచి ఉద్యమ సందర్భాన్ని మరోసారి స్మరించుకునేలా చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి బృందాన్ని అధినేత కేసీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎంఎల్ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేత గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story