- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KCR : పార్టీ నేతలపై కేసీఆర్ ఆగ్రహం

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ(BRS Party) స్థాపించి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. నిర్వహించాల్సిన కార్యక్రమాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Cheif KCR) నేడు ఆ పార్టీ నేతలతో తెలంగాణ భవన్లో(Telangana Bhavan) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకోసం పోరాటం చేయగల పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2028లో అధికారంలోకి వచ్చేది 100 శాతం తామే అని అన్నారు. కాగా గత పార్లమెంటు ఎనికల్లో ఓడిపోగానే స్వంత పార్టీ నేతలు నైరాశ్యం చెందారని.. పార్టీలో ఉంటూనే నెగెటివ్ ప్రచారం చేశారని గులాబీ బాస్ మండిపడ్డారు. ఓడిపోయినంత మాత్రాన పార్టీ పని అయిపోయిందని భావించక్కర్లేదని.. అలా అనుకొని పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
తెలంగాణలో ఉప ఎన్నికలు(By Elections)రావడం ఖాయం అని.. పార్టీ నేతలు, శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే విధంగా.. రానున్న స్థానిక ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడాలని కేసీఆర్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఇంతలా ప్రజల్లో వ్యతిరేకత ఇంత తొందరగా వస్తుందనుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి సంవత్సరం ఆదాయం పెంచుకుంటూ పోయామని, ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుందన్నారు. తమ ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి వారితో పని చేయించుకోవడం రావడం లేదన్నారు.
ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు(Silver Jubly Celebrations) ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో వ్యవస్థాగత కమిటీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అదే విధంగా.. పార్టీలో విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్ట పరచాలన్నారు. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీ లను ఏర్పాటు చేసి, ఆయా కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావు(Harish Rao)ను నియమిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి జిల్లాలో చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించి.. పార్టీ ప్లీనరీ సమావేశాలపై చర్చిస్తామని కేసీఆర్ తెలియ జేశారు.