ఉడుములుగా సొచ్చి అవస్థలు తెచ్చిండ్రు.. కాంగ్రెస్‌పై KCR ఫైర్

by Disha Web Desk 9 |
ఉడుములుగా సొచ్చి అవస్థలు తెచ్చిండ్రు.. కాంగ్రెస్‌పై KCR ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు బస్సు యాత్ర చేపట్టారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లీ విగ్రహానికి పూల మాలలు వేసి కేసీఆర్ నేడు బస్సు యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మీ అందర్ని నేను ఒక్కటే కోరుతున్నా.. 1956 నుంచి ఈ నాటి వరకు మన శత్రువే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 1956లో తెలంగాణని, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 58 సంవత్సరాలు మనల్ని గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా అడ్డగొలుగా 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుములుగా సొచ్చి మనకి ఈ అవస్థలు తెచ్చిపెట్టిందని కాంగ్రెస్ పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story