KCR: జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల కేసీఆర్ సంతాపం

by Prasad Jukanti |
KCR: జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల కేసీఆర్ సంతాపం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జిట్టా మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో జిట్టా శ్రీయాశీలకంగా పాల్గొన్నారని ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డి కృషిని స్మరించుకున్నారు. శోకతప్త కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ పోస్టు చేసింది. కాగా గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయానికి ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

Advertisement

Next Story

Most Viewed