Kavitha: బెయిల్ తర్వాత ట్రయల్ కోర్టుకు కవిత హాజరు

by Prasad Jukanti |
Kavitha: బెయిల్ తర్వాత ట్రయల్ కోర్టుకు కవిత హాజరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో నిన్న బెయిల్ పై జైలు నుంచి విడుదలైన కవిత ఇవాళ ట్రయల్ కోర్టులో జరిగిన విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు. ఇవాళ సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పై విచారణ జరిగింది. కాాగ ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనిశ్ సిసోడియా సైతం వర్చువల్ గా హాజరయ్యారు. జైలు నుంచి విడుదలైన కవిత ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ కు వస్తున్న కవితకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల ఏర్పాట్లు చేస్తున్నాయి.

Advertisement

Next Story