సీబీఐ కేసులో కవిత పై విచారణ జూలై 22కు వాయిదా!.. జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు

by Ramesh Goud |
సీబీఐ కేసులో  కవిత పై విచారణ జూలై 22కు వాయిదా!.. జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణను రౌజ్ అవెన్యూ కోర్టు జూలై 22 కు వాయిదా వేసింది. దీంతో కవిత జ్యూడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితను నిందితురాలిగా చేరుస్తూ.. సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కవితను ఏప్రిల్ 11న అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ జరిపాల్సి ఉండగా.. విచారణను జూలై 22కు వాయిదా వేస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కవితపై విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది. దీంతో సీబీఐ కేసులో కవిత జ్యూడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది.



Next Story