అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

by karthikeya |
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
X

దిశ, వెల్గటూర్: జగిత్యాల పట్టణం, ధర్మారం రహదారిపై ఉమ్మడి వెల్గటూర్ మండలం గుళ్లకోట శివారులో ఆదివారం అర్ధరాత్రి వేళ ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. మృతదేహం సాయింపేటకు చెందిన సాయికుమార్ (23) అనే యువకుడిదిగా గుర్తించారు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని.. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా చంపేసి వెళ్ళారా? లేదా ఏదైనా గుర్తు తెలియని వాహనం డీ కొట్టడంతో మృతి చెందాడా..? అనేది తెలియడం లేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సాయికుమార్ ధర్మారం మండలం శాయంపేట గ్రామంలో బంధువుల ఇంటి వద్ద ఉంటూ ధర్మారం అర్బన్ బ్యాంకులో ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు.

ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్లిన సాయికుమార్ అర్ధరాత్రి సమయంలో గల్లకోట శివారులో శవంగా కనిపించాడు. అయితే మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండడంతో ఇది యాక్సిడెంటా..? లేక హత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని జగిత్యాల మార్చురీకి తరలించి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed