రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకుండ్రు.. నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణ

by Aamani |
రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకుండ్రు.. నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణ
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకున్నారని అభ్యర్థులు ఆందోళన చేశారు. గత నెల 29న సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త రేషన్ షాపుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 58 కొత్త రేషన్ డీలర్ పోస్టులకు 830 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఈనెల 15 ఆదివారం రోజున 765 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆర్డీవో సమక్షంలో అధికారులు ఇంటర్వ్యులు నిర్వహించారు.

కాగా రేషన్ డీలర్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆర్డీవో కార్యాలయం ఎదుట అభ్యర్థులు ఆందోళన చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు రేషన్ డీలర్ పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. రాత పరీక్ష సరైన విధంగా జరగలేదని, పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేయలేదన్నారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రేషన్ డీలర్ల పోస్టుల భర్తీని నిలిపివేయాలని కోరారు.

Next Story

Most Viewed