ఏకంగా శివాలయంలో అమావాస్య రోజున క్షుద్ర పూజలు

by Mahesh |
ఏకంగా శివాలయంలో అమావాస్య రోజున క్షుద్ర పూజలు
X

దిశ, మేడిపల్లి: అమావాస్య వేళ.. ఏకంగా శివాలయంలో క్షుద్ర పూజలు చేయడం కలకలం గా మారింది. ఈ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో శివాలయం లో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం అర్ధరాత్రి పూజారి దగ్గరికి వచ్చి నేను రాత్రి దేవాలయంలో నిద్ర చేస్తానని చెప్పి దేవాలయం తాళం తీసుకున్నాడు. అనంతర నిన్న రాత్రి గుడిలోకి కాసేపు నిద్ర చేసి రాత్రి 12 గంటల సమయంలో క్షుద్ర పూజలు చేయడం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన శబ్దాలు వినబడటం తో గుడి పక్కనే ఉన్న గ్రామస్తులు ఆ దేవాలయం దగ్గరికి వచ్చి.. ఆలయంలో మంత్రాలు చేస్తున్న వ్యక్తిని బెదిరించి ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బుధవారం అమావాస్య కావడంతో సదరు వ్యక్తి ఏం పూజలు చేశాడో, ఎవరికీ హాని తల పెట్టబోతున్నాడోనని ఆందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed