మరోసారి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

by Mahesh |
మరోసారి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
X

దిశ, హుజురాబాద్: ఐదేండ్ల పదవీ కాలంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోయడం తప్ప చేసిందేమీ లేదని బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హుజురాబాద్ సూపర్ బజార్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్నర్ మీటింగులో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేద ప్రజల పొట్టగట్టింది తప్ప పేదలకు చేసిందేమీ లేదని అన్నారు. ఓట్ల కోసం వచ్చిన నాయకులు చేసిన అభివృద్ధి చెప్పాలి తప్ప గుళ్ళు, గోపురాల పేరిట ఓట్లు అడగటమేమిటని అన్నారు. గుళ్ళు కట్టడమే అభివృద్ది అయితే కెసిఆర్ గుళ్ళు కట్టలేదా అని ప్రశ్నించారు. వందల ఎకరాల్లో యాదగిరి గుట్ట కట్టి ప్రజలకు అంకితం ఇవ్వలేదా అని అన్నారు. ఎన్ని గుళ్ళు కట్టి ప్రజలకు అంకితం ఇచ్చిన ఘనత కేసీఆర్ కు ఉందని,కాళేశ్వరం కట్టి ప్రజలకు సాగునీరు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ సొంతం అని అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నేతన్నల పై జీఎస్‌టి పేరిట పన్ను వేసి వారి ఆత్మ హత్యలకు మోడీ కారణమయ్యాడని అన్నారు. రాష్ట్రంలో పవర్ లూమ్స్ రద్దు చేసి హైద్రాబాద్‌ను మాత్రం యూటి చేస్తామని అంటున్నారని అన్నారు. పదేండ్ల బీజేపీ పాలన విషం అని, పదేండ్ల కేసీఆర్ పాలన నిజం అని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు చేసింది ఏమీ లేదని, 500 బోనస్ ఇచ్చడా..?2500 మహిళలకు ఇచ్చాడా...?రెండు లక్షల ఋణ మాఫీ చేశారా...? అని ప్రశ్నించాడు...ప్రజలకు సుభిక్షమైన పాలన అందాలంటే కెసిఆర్ పెట్టిన ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించాలని,కౌశిక్ రెడ్డి,వినోద్ ల ఆధ్వర్యంలో హుజురాబాద్ అభివృద్ది చెందుతుందని, వారిని వలపట,దాపట ఎద్దులు గా కేటీఆర్ అభివర్ణించాడు.అభివృద్ది కోసం ఢిల్లీ,గల్లి లో కనబడని బండి సంజయ్ దేవుని గుళ్ల పేరిట రాజకీయం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని,బండి నీ నమ్మి మోసపోకుండా వినోద్ కు అవకాశం కల్పించాలని కోరారు.



Next Story