Korutla MLA : అధికారులు విధులలో నిర్లక్ష్యం వహించద్దు...

by Aamani |
Korutla MLA : అధికారులు విధులలో నిర్లక్ష్యం వహించద్దు...
X

దిశ, మల్లాపూర్ : అధికారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జగదీష్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉందని, గ్రామాల్లో స్పెషల్ అధికారులు, కార్యదర్శులు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు.

ప్రభుత్వ అధికారులకు ప్రజల పన్నులతోనే జీతాలు వస్తున్నాయని ప్రజలకు సేవ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు.పది నెలల ప్రభుత్వ పరిపాలనలో తెలంగాణ ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని అన్నారు. రైతులకు రుణమాఫీ చెయ్యడం లో సాకులు చూపుతూ ప్రభుత్వం జాప్యం చేస్తుందని రుణమాఫీ కానీ రైతులకు ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వీర్ సింగ్, సిరిపూర్ సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, ఏవో లావణ్య, ఐ సి డి ఓ శంకరమ్మ అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed