నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తాయి అన్నారు.. వైరల్‌గా హీరో కార్తి కామెంట్స్

by sudharani |
నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తాయి అన్నారు.. వైరల్‌గా హీరో కార్తి కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న తాజా సినిమా ‘సత్యం సుందరం’. ‘96’ (తెలుగులో జాను) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తమిళ స్టార్ హీరో సూర్య, సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘మనలోని చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చే ఓ ఫీల్ గుడ్ మూవీ ‘సత్యం సుందరం’. ఈ కథ చదువుతున్నప్పుడు చాలా చోట్ల ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. సోదరుల్లాంటి రెండు పాత్రల మధ్య నడిచే కథ ఇది. ‘96’లాగే ఒక్క రాత్రిలో జరిగే కథగా ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. నాకు కె. విశ్వనాథ్ చిత్రాలంటే బాగా ఇష్టం. కానీ అలాంటి కథలు ఇప్పుడు రావడం లేదు. కానీ ఈ కథ విన్నప్పుడు అలాంటి ఒక మంచి సినిమా అవుతుంది అనిపించింది. అలాంటి అరుదైన స్క్రిప్ట్ ఇది. అన్నయ్య సూర్య ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు ‘నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయి’ అని అన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు కార్తీ.

Next Story

Most Viewed