సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే : ఎస్పీ అఖిల్ మహాజన్

by Aamani |
సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే : ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : బాధితులకు సత్వర న్యాయం చేయడానికే ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి 16 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూ తగాదాలు, ఆస్తి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ, బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు.

గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.

Next Story

Most Viewed