గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు

by Sridhar Babu |
గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు
X

దిశ, మేడిపల్లి : జగిత్యాల జిల్లాలోని నూతన మండలంగా ఏర్పడిన భీమారంలో లంకె బిందెలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం సృష్టించాయి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భీమారం మండల తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లో అపరిచితులు వస్తుండడం అలాగే ఆ ఇంట్లో పూజలు చేస్తున్నట్లు, మంత్రాలు జపిస్తున్నట్లు రాత్రి వేళల్లో భయంకర శబ్దాలు రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెళ్లి చుసిన స్థానికులకు ఆ ఇంట్లో గది మధ్యలో తవ్వి మట్టిని రాసులుగా పోసినట్లు,

అక్కడే జీవాలను బలి ఇవ్వడానికి తీసుకువచ్చినట్లు ఆనవాలు కనిపించిండంతో ఏం జరుగుతుందోనని గమనించే పనిలో పడ్డారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అసలు ఆ ఇంట్లో ఏముంది..?. తెలుసుకోవడం కొరకు పోలీసుల సహాయంతో ఎక్కడైతే మట్టి తీసి ఉన్న ప్రదేశంలో స్థానికులు ఇంట్లోని ఒక గదిలో తవ్వి చూసినప్పటికీ ఏమీ కనబడలేదు. సంఘటన స్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed