missing : సౌదీలో బీర్పూర్ వాసి అదృశ్యం..

by Sumithra |
missing : సౌదీలో బీర్పూర్ వాసి అదృశ్యం..
X

దిశ, బీర్పూర్ : జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన కందుల తిరుపతి (35) సౌదీలో గత కొన్ని నెలలుగా అదృశ్యం అయ్యాడు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ జిద్దాలోని గ్రీన్ రెడ్ కంపెనీలో పనిచేసే తిరుపతి చివరిసారి 2023 డిసెంబర్ 7 న కుటుంబ సభ్యులతో మాట్లాడాడని, అప్పటి నుంచి ఇతని ఆచూకీ లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. తిరుపతికి భార్య అనూష, కుమారులు శ్రీవర్థన్, శ్రీజన్ ఉన్నారు. తిరుపతి ఆచూకీ కనుక్కోగలరని వారు అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దయచేసి ఎవరైనా సౌదీలో ఉన్న మీ మిత్రులకు గాని బంధువులకు గాని ఈ సందేశాన్ని పంపగలరని వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed