- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హుస్నాబాద్లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయాలి.. బండి సంజయ్కు వినతి
దిశ,కరీంనగర్ టౌన్ : హుస్నాబాద్ లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయించాలని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా మాజీ సర్పంచులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కోరారు. ఈ మేరకు శుక్రవారం హుస్నాబాద్ కు చెందిన పలువురు తాజా మాజీ సర్పంచులు, బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత నుండి హుస్నాబాద్ నియోజకవర్గం సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. పొన్నం ప్రభాకర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తు పిచ్చి పిచ్చి చేష్టలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెధవ, ముండా కొడకా…అంటూ రాయలేని భాషలో బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలు కూడా పొన్నం ప్రభాకర్ గారి వద్దకు వెళ్లాలంటనే భయపడే పరిస్థితి నెలకొందని వాపోయారు . పొన్నం ప్రభాకర్ తీరును చూస్తుంటే ఆయన మతి స్థిమితం కోల్పోయినట్లుందని ఆయన మెప్పు పొందేందుకు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తీరులో వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. ఇలాంటి వారికి మానసిక చికిత్స అవసరమని అందుకోసమే హుస్నాబాద్ లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు.
బీజేపీలో చేరిన పలువురు తాజా మాజీ సర్పంచులు....
నియోజకవర్గానికి చెందిన కొందరు మాజీ సర్పంచులు బండి సంజయ్ సమక్షంలో శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీలో చేరమన్నారు.