జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటా: కేంద్రమంత్రి బండి సంజయ్

by Satheesh |
జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటా: కేంద్రమంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత జిల్లా కరీంనగర్‌‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్రమంత్రి బండి సంజయ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆదివారం కరీంనగర్ కార్పొరేటర్లతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండిని కార్పొరేట్లరు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా కార్పొరేటర్ స్థాయి నుండే కేంద్రమంత్రి అయ్యానని గుర్తు చేసుకున్నారు. జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని బండి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి నిధులు తెచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. కరీంనగర్‌ను అద్దంలా తీర్చిదిద్దుతానని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధిపై జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో చర్చిస్తానని అన్నారు. స్మార్ట్ సిటీ మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed