Living with problems: చాలా మంది మనకెందుకులే అనుకుంటారు.. ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |   ( Updated:2024-09-13 07:58:05.0  )
Living with problems: చాలా మంది మనకెందుకులే అనుకుంటారు.. ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమ్యలతో సావాసాన్ని అలావాటు చేసుకొని జీవితాన్ని గడిపేవారు సగటు మనుషులుగానే మిగిలిపోతారు.. కానీ ఆ సమస్యల పరిష్కారానికి తపిస్తూ అందుకు మార్గాలు మార్గాలు అన్వేషించేవారే మార్పునకు నాంది పలుకుతారు.. అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కామెంట్స్ చేశారు. దీనిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రేట్ వర్డ్స్ బై ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశారు. అవును.. సమస్యలతో సావాసాన్ని అలవాటు చేసుకుంటే సగటు మనుషులుగానే మిగులుతారని సజ్జనార్ పేర్కొన్నారు.

వృత్తి జీవితంలో ఒక సమస్య వస్తే దాటవేసే ధోరణి అవలంభించడం ప్రస్తుతం సర్వసాధారణం అని సజ్జనార్ అన్నారు. చాలా మంది మనకెందుకులే అనుకుంటారని, కొందరే సమస్యల పరిష్కారానికి సృజనాత్మక ఆలోచనలు చేస్తారన్నారని వెల్లడించారు. తమ ఆవిష్కరణలతో ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలుస్తారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed