గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు.. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం

by srinivas |
గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు.. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో పని చేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్లను యధాతథంగా కొనసాగించాలని ఇంటర్ బోర్డ్ డైరెక్టర్ శృతి ఓజా శుక్రవారం అన్ని జిల్లాల ఇంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో గత 10 సంవత్సరాలుగా గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న అధ్యాపకులకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ సందర్బంగా గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ మాట్లాడుతూ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నుండి పూర్తి ఉత్తర్వులు విడుదల కావడానికి సమయం పట్టనుండటంతో కాలేజీలలో తరగతుల నిర్వహాణకై ఇబ్బందులు రాకుండా చేసారని తెలిపారు. ఇందుకోసం సత్వర ఆదేశాలు వచ్చేలా చేసిన సీఎం రేవంత్ రెడ్డికి సహకరించిన మంత్రులకు, ప్రభుత్వ విప్‌లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ప్రభుత్వ పెద్దలకు, కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధులకు, నాయకులకు, అధికారులకు, ఇంటర్ బోర్డ్ సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు

Advertisement

Next Story

Most Viewed