'హైడ్రా' మరో కీలక నిర్ణయం.. 'తగ్గేదే లే' అంటున్న కమిషనర్

by M.Rajitha |
హైడ్రా మరో కీలక నిర్ణయం.. తగ్గేదే లే అంటున్న కమిషనర్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలను కూల్చివేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువైంది హైడ్రా. తాజాగా హైడ్రా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టింది. 'కమిషనర్ హైడ్రా' పేరుతో 'ఎక్స్'లో ఖాతా ప్రారంభించింది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఈడీవీఎం) ఖాతానే కమిషనర్ హైడ్రాగా మార్చారు. నగరంలో హైడ్రా చేపడుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా హైడ్రా చేస్తున్న పనుల మీద దుమారం కూడా రేగుతోంది. ఎవ్వరు ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేసినా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం కూల్చివేతలను ఆపకపోవడం, వాటి మీద స్పందించక పోవడం గమనార్హం.

Next Story

Most Viewed